ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు

-

ఆంధ్ర ప్రదేశ్ లో మొన్నటి వరకు పెరిగిన కరోనా కేసులు కాస్త తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నిన్నటి కంటే ఈ రోజు కేసులు కాస్త పెరిగాయి కరోనా కేసులు. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2567 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,26,988 కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో మరో 18 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13,042 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26,710 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 18,87,236 లక్షలకు చేరింది.

అలాగే గడిచిన 24 గంటల్లో 3034 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 81, 763 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 31, 30, 708 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news