ఏపీలో పెరిగిన కరోనా.. ఇవాళ 320 కేసులు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… కరోనా కేసులు వాళ్ళ మరోసారి కాస్త పెరిగాయి. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ సుమారు వంద కేసులు పెరిగాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 320 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,68, 241 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 5 మంది చనిపోవడం తో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 397 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3458 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి.

ఇక గడిచిన 24 గంటల్లో 425 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 50 , 386 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 38 , 768 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 97 , 45 , 537 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news