చంద్రబాబు ప్రభుత్వము ఉన్న సమయంలో జరిగిన అవినీతిని ప్రశ్నించని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్కు కూడా అవినీతిలో భాగస్వామ్యం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం లో ఎక్కడా అవినీతి జరుగకున్నా అవినీతి జరిగిందని ఆరోపించడం అవివేకమని అన్నారు .కాకినాడలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు.
చంద్రబాబు అవినీతిపై లేఖ రాయని పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై కేంద్రానికి లేఖ రాయడాన్ని తప్పు పట్టారు. 2014లో చంద్రబాబు, పవన్ కలిసి పేదవారికి 3 సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సెంటు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. జన్మభూమి కమిటీలకు లంచం ఇస్తే తప్ప పని జరిగేది కాదని అన్నారు.టీడీపీ, జనసేన రాబోయే ఎన్నికల్లో కుట్ర రాజకీయాలు చేయనున్నయని, అంతేకాకుండా కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేసే అవకాశముందని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి వారి కుట్రలను తిప్పికొట్టాలని కోరారు. తమ ప్రభుత్వ హయాంలో ఎక్కడా వివక్ష కాని లంచాలకు పాల్పడడం లేదని స్పష్టం చేశారు.