నేడు ఏలూరుకి సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి..

-

నేడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రానున్నారు. ఆరోగ్యశ్రీని ఆమోదిస్తున్న ఆస్పత్రుల్లో… బాధితుల వైద్యం ఖర్చులు రూ.1000 దాటితే… ఆ ఆపరేషన్లన్నింటినీ… ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి… ఫ్రీగా వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ముందుగా పశ్చిమగోదావరి జిల్లాలో ఇది పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభం కాబోతోంది. అక్కడ అది ఎలా అమలవుతుందన్నదాన్నిబట్టీ… రాష్ట్రమంతా అమలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2,059 చికిత్సలు రాబోతున్నాయి.

ఈ పైలెట్‌ ప్రాజెక్టు ద్వారా జిల్లావ్యాప్తంగా 12,45,511 మందికి ప్రయోజనం చేకూరనుంది. ఈ స్కీం కోసం ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. ఎవరైనా లబ్ధిదారులు మిగిలిపోతే… వారు ఎవరిని సంప్రదించాలి.. ఎవరికి దరఖాస్తు చేయాలన్న అంశాల్ని కూడా అక్కడే తెలపనున్నారు. ముఖ్యమంత్రి రాక కోసం ఏలూరులో ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news