నేడు తిరుపతిలో సీఎం జగన్‌ పర్యటన

-

ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌ కు సీఎం జగన్‌ వెళ్లానున్నారు. ఈ మేరకు ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌ తిరుపతి పర్యటనకు వెళతారు. ఈ సందర్భంగా ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్‌… ఈ మేరకు మధ్యాహ్నం 2.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు.

AP CM Jagan will go To Tiupathi

తిరుపతిలోని తాజ్‌ హోటల్‌లో జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్‌…అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. దీంతో అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. కాగా, ఉరవకొండ వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో సీఎం జగన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చంద్రబాబుకి  స్టార్  క్యాంపెయినర్లు ఎక్కువ అన్నారు.  స్టార్ క్యాంపెయినర్లు అంటే.. చంద్రబాబు ను భుజాన ఎత్తుకొని మోసే ముఠా. పక్కా రాష్ట్రంలో ఉండే దత్తపుత్రుడు ఒక స్టార్ క్యాంపెయినర్ ..  పక్కా పార్టీలోకి వెళ్లి చంద్రబాబుకు మద్దతు పలికే వారు..  వీళ్లదే రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలో కూడా కొంత మంది స్టార్ క్యాంపెయినర్లున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news