పేదలకు జ‌గ‌న్ స‌ర్కార్ మరో అద్భుత వరం

-

ఎన్నికల హామీలు అమలు దిశగా వైయస్‌ జగన్‌ సర్కార్‌. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాదు ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన ప్రతి హామీనీ లెక్కగా పూర్తి నెరవేర్చుకుంటూ వస్తున్నారు వైయస్ జగన్. సామాజిక మార్పు, సంక్షేమ పథకాలు, అవినీతి రహిత ప్రభుత్వం ఇలా ఒక్కో మెట్టూ నిర్మించుకుంటూ వెళుతున్నారు. ప్రతి నెల ఓ కొత్త సంక్షేమ పథకం అమలు. సంక్షేమ పథకాల అమలులో దూకుడుగా వ్యవహరిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు పథకాలు అమలు చేసిన ఆయన, నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి రెడీ అయ్యారు.

ఉగాది పర్వదినాన 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కోసం వైసీపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. అందుకు ప్రభుత్వ భూములను కేటాయించడంతో పాటు ఇతర ప్రత్యమ్నాయ మార్గాల ద్వారా స్థలాలను సేకరిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములను తమ ఆధీనంలో ఉంచుకున్న వారి నుంచి కూడా భూములను స్వాధీనం చేసుకోనున్నారు. అదేవిధంగా, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ శాఖలకు కేటాయించిన భూముల్లో నిరూపయోగంగా ఉన్న వాటిని కూడా స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news