ఏపీ కరోనా : ఎనిమిది లక్షలు దాటేశాయి

-

ఏపీలో కొద్ది రోజులుగా కరోనా కేసులు కాస్త భారీగానే నమోదవుతున్న సంగతి తెలిసిందే. నిన్న కాస్త తగ్గిన కరోన కేసులు ఈ రోజు నిన్నటి కంటే మళ్ళీ పెరిగాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,765 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 800684కి పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలో మరో 20 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 6544కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31721 యాక్టివ్‌ కరోనా కేసులు న్నాయి.

ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 762419లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 80,238 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 74,28,014 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలానే జిల్లా వారీగా చూస్తే అనంతపురంలో 152, చిత్తూరులో 347, తూర్పుగోదావరి జిల్లాలో 475, గుంటూరులో 523, కడపలో 225, కృష్ణాలో 460, కర్నూలులో 69, నెల్లూరులో 122, ప్రకాశంలో 317, శ్రీకాకుళంలో 199, విశాఖపట్నంలో 218, విజయనగరంలో 126, పశ్చిమ గోదావరిలో 532 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news