ఏపీలో తగ్గినా కరోనా కేసులు.. ఈరోజు ఎన్నంటే ?

-

ఏపీలో మళ్ళీ భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే రోజూ నమోదయ్యే కేసుల కంటే కాస్త తక్కువగా నమోదయ్యాయి. తాజాగా ఏపీ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,368 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 70 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,06,493కి చేరింది. ఇప్పటిదాకా మొత్తం 4487 మంది మరణించారు.

ap-corona

ఇక ఏపీలో ఇప్పటివరకు 404074 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 97932 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే గడిచిన 24 గంటల్లోనే 10,055 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులెటిన్ లో పేర్కొంది. కాగా నిన్న ఒక్క రోజే 58,187 పరీక్షలు చేయగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 41,66,077 టెస్టులు చేశారు. ఈరోజు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version