ఏపీ కరోనా అప్డేట్ : 733 కేసులు, 6 మరణాలు

-

ఏపీలో కొద్ది రోజులుగా కరోనా కేసులు కాస్త భారీగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 733 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య  866438కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో ఆరుగురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 6976కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12137 యాక్టివ్‌ కరోనా కేసులున్నాయి.

corona
corona

ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 847325 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే ఏపీలో 57,752 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 99,13,068 కరోనా పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే జిల్లాల వారీగా చూస్తే అనంతపురంలో 40, చిత్తూరు 74, తూర్పుగోదావరి జిల్లాలో 65, గుంటూరు 112, కడపలో 33, కృష్ణాలో 102, కర్నూలులో 21, నెల్లూరు 29, ప్రకాశంలో 13, శ్రీకాకుళంలో 22, విశాఖపట్నంలో 73, విజయనగరంలో 31, పశ్చిమ గోదావరిలో 118 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news