ఏపీలో కొత్త‌గా 148 క‌రోనా కేసులు, మూడు మ‌ర‌ణాలు

-

ఆంధ్ర ప్రదేశ్‌రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు ఓ రోజు పెరుగుతూ.. ఓ రోజు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన క‌రోనా బులిటెన్ ప్ర‌కారం.. ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 148 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2075419 కి పెరిగింది. కోవిడ్ వల్ల చిత్తూరు, గుం టూరు మరియు కృ ష్ణా లలో ఒక్కొ క్క రు చొప్పు న మరణిం చారు. క‌రోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14474 కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 1814 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 152 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2059131 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 33,043 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,08,95,748 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news