ఏపీలో పెరిగిన కరోనా.. కొత్తగా 186 కేసులు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు ఓ రోజు పెరుగుతో రోజు తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త పెరిగాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. ఏపీ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కొత్తగా 186 కరోనా మహమ్మారి కేసులు నమోదు అయ్యాయి.

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,73, 576 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో మూడు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 448 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2149 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 191 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 56 , 979 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 32, 036 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3, 05 , 39 , 041 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news