ఏపీ ప్రజలకు బిగ్ రిలీఫ్.. కొత్త‌గా 5879 క‌రోనా కేసులు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ రిలీఫ్ లభించింది. గత నెలరోజుల నుంచి విపరీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే… తాజాగా కరోనా మహమ్మారి కేసులు ఒక్కసారిగా పడిపోయాయి. కేవలం 5000 లోపు కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… రాష్ట్రంలో కొత్తగా కేవలం…5879 క‌రోనా కేసులు.. నమోదు అయ్యాయి.

ap carona
ap carona

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 22,76,370 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 9 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14,615 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,10,517 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 11,384 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 21,51,238 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 25 , 284 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3, 24 , 70, 712 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news