ఏపీలో భారీగా తగ్గిన కరోనా.. ఇవాళ 150 కేసులు,3 మరణాలు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ మాత్రం భారీగా తగ్గిపోయాయి కరోనా మహమ్మారి కేసులు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ రాష్ట్రవ్యాప్తంగా కేవలం 150 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి..

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,67, 706 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో ముగ్గురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 391 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3760 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 217 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 49 , 555 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 23 , 824 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 96 , 75 , 938 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news