జగన్‌ కు షాక్‌.. మలి దశ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ఉద్యోగులు

-

జగన్‌ కు షాక్‌ ఇచ్చారు ఏపీ ఉద్యోగుల. ఇవాళ్టి నుంచి మలి దశ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ఏపీ జేఏసీ అమరావతి. లెనిన్ సెంటర్లో నల్ల కండువాలు ధరించి పోస్టర్లు రిలీజ్ చేసి నిరసనలో పాల్గొన్నారు జేఏసీ చైర్మైన్ బొప్పరాజు,ఇతర నేతలు.

ఈ సందర్భంగా చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… ఉద్యోగుల డిమాండ్ లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నందుకు ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. పీఆర్సీ,డీఏ బకాయిలపై స్పష్టత ఇవ్వడం లేదని ఆగ్రహించారు. గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులను కూడా ఇబ్బంది పెడుతున్నారు… ఉద్యోగులకు ఇచ్చే జీతాలు,పెన్షన్లపై ప్రభుత్వం తప్పు లెక్కలు చెబుతుందని తెలిపారు. సంఘాలతో సంబంధం లేకుండా ఉద్యోగులంతా ఉద్యమంలో పాల్గొనాలని కోరారు జేఏసీ చైర్మైన్ బొప్పరాజు.

 

Read more RELATED
Recommended to you

Latest news