ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో ఏపీ ప్రభుత్వ అవగాహన ఒప్పందం

-

రాష్ట్రంలో ఆర్థిక పురోగతి, ప్రభుత్వ శాఖల్లో సంస్కరణలు, యువతకు ఉపాధి అవకాశాలపై హైదరాబాద్​లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్​తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మేరకు ఏపీ ప్రభుత్వం ఐఎస్​బీ పాలసీ ల్యాబ్ ఏర్పాటు చేయనుంది. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ శాఖలు కోల్పోయిన రెవెన్యూ, అభివృద్ధికి తదుపరి చేపట్టాల్సిన లక్ష్యాలు, తదితర అంశాలపై ఐఎస్​బీ సహకారంతో ఏర్పాటు చేయనున్న ల్యాబ్ పర్యవేక్షణ చేయనుంది.

ap

దీంతో పాటు యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలపై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఐఎస్​బీ ప్రతినిధులు ఈ అవగాహన ఒప్పందం పత్రాలను మార్చుకున్నారు. గ్రోత్ ఇంజిన్​గా విశాఖ అభివృద్ధి, రాయలసీమలో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు, ప్రోత్సాహకాలు, ఇ-గవర్నర్నెన్స్ తదితర అంశాల్లోనూ పనిచేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version