మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. అదేంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

-

ఏపీలో మహిళలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వైఎస్‌ఆర్‌ చేయూత పథకానికి దరఖాస్తు చేసేందుకు మరో ఐదు రోజులు గడువు పెంచింది. పింఛన్‌దారులకూ చేయూత పథకంలో సాయం అందిస్తామని సీఎం జగన్ ప్రకటించడంతో దరఖాస్తు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అర్హత ఉండి ఇప్పటి వరకు ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మహిళలకు జీవనోపాధి మార్గాలను కల్పించడం, వారిని ఆర్థికంగా పైకి తీసుకురావడం ద్వారా వారి జీవనప్రమాణాలు మెరుగుపరిచేందుకు ‘‘వైఎస్సార్‌ చేయూత’’ద్వారా ఆదుకుంటామని గత ఎన్నికల ప్రణాళికలో వైఎస్‌.జగన్‌ హామీ ఇచ్చారు.

JAGAN
 

ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకు 45 ఏళ్లనుంచి 60ఏళ్లలోపు ఉన్నవారందరికీ కూడా ఈ పథకం కింద అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి నాలుగేళ్లలో రూ.75వేలు వారి చేతిలోపెట్టనున్నట్టు ప్రకటించారు. ఈ హామీకి కట్టుబడి ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. జూన్‌ 28 నుంచి లబ్ధిదారులనుంచి దరఖాస్తులను తీసుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news