నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ : 2190 పోస్టులకు నోటిఫికేషన్ !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైద్య కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా పెద్ద మొత్తంలో ఆరోగ్య శాఖలో అదనంగా కొత్త పోస్టులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది జగన్ సర్కారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఏకంగా 2190 కొత్త పోస్టులు మంజూరు చేస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది జగన్ సర్కార్.

ఈ పోస్టుల వివరాల్లోకి వెళితే.. 35 మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆస్పత్రుల్లో… 51 ప్రొఫెసర్లు, 187 అసోసియేట్ ప్రొఫెసర్లు, 130 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 1040 నర్సింగ్ పోస్టులు, 782 పారామెడికల్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని జగన్ సర్కార్ పై అధికారులను ఆదేశించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో.. వైద్య శాఖలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పాండమిక్ సమయంలో వైద్య శాఖ ను బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నిర్ణయంతో…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబిబిఎస్, బిజీ అలాగే సూపర్స్పెషాలిటీ సీట్లు పెరగనున్నాయి. తద్వారా ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news