కరోనా లాక్ డౌన్ కారణంగా అలస్యమైన ఇంటర్మీడియట్ ఫలితాలు ఎట్టకేలకు ఇవాళ విడుదలయ్యాయి. కొద్దిసేపటి క్రితం ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ విడుదల చేశారు. ఈ ఏడాది నుంచి గ్రేడింగ్ విధానం రద్దు అయినందున ఫస్ట్ ఇయర్ ఫలితాలను సబ్జెక్టుల వారీగా మార్కుల రూపంలో ప్రకటించారు. అయితే సెకండ్ ఇయర్ విద్యార్ధులకు మాత్రం గ్రేడ్లను ప్రకటించారు. అసలు 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశంలో ఇంత వరకు ఏ రాష్ట్రం కూడా ఇంటర్ ఫలితాలను ప్రకటించలేదు. ఏపీనే తొలి రాష్ట్రం. మొత్తంగా చూసుకుంటే ఈ సంవత్సరం 5,07,228 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాశారు. వారిలో 3,00,560 మంది ఉత్తీర్ణులయ్యారని, పాస్ శాతం 59 అని మంత్రి వివరించారు. అలాగే 4,88,795 మంది రెండో సంవత్సరం విద్యార్థులు పరీక్షలను రాశారు. వారిలో పాసైంది 2,76,389 మంది అని, పాస్ శాతం 63 అని తెలిపారు. ఇకపోతే ఫలితాల అనంతరం కాలేజీలు ఎలాంటి ప్రకటనలు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో జారీ చేయకూడదని బోర్డు అధికారులు ఆదేశాలు ఇచ్చారు. మెమోలను జూన్ 15 నుంచి ఏపీ ఇంటర్ బోర్డు అఫీషియల్ వెబ్సైట్ https://bie.ap.gov.in/ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల..!
-
Read more RELATEDRecommended to you
ఒకటో తారీఖు వచ్చింది…పెన్షన్ ఏదీ..!
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ పెన్షనర్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకటో...
వైరల్ వీడియోస్.. కాళ్లతో డ్రైవింగ్ చేసిన మహిళ, ట్రక్ నడుపుతూ స్నానం చేసిన డ్రైవర్
ఎన్నడు లేనంతగా ఎండలు మండిపోతున్నాయి.. ఈ వేడికి ఇంట్లో ఉండటమే కష్టంగా...
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
శంషాబాద్ ఎయిర్ పోర్టు తరహాలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి చేస్తామని సికింద్రాబాద్...
Anji N -