వైసీపీ సర్కార్‌పై హైకోర్టు ఆగ్ర‌హం.. ఇవేం రంగులంటూ..

-

ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ వైసీపీ జెండా రంగులతో నింపేస్తున్న ఏపీ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు పంచాయతీ ఆఫీసుకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. దీంతో ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు ఏమిటని కోర్టు నిలదీసింది. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఏ ప్రాతిపదికన రంగులు వేశారో పది రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ గుంటూరు కలెక్టర్‌ను కోర్టు ఆదేశించింది.

ఇలాంటి చర్యలు సమంజసం కాదని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా… ఇలాంటి వాటికి పాల్పడకూడదని తెలిపింది. కాగా, గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు పంచాయతీ కార్యాలయానికి వైసీపీ జెండా రంగులు వేయడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిపిన న్యాయ స్థానం ప్రభుత్వం తీరుపై తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ జెండా రంగులు ఎలా వేస్తున్నారని ప్రశ్నించింది.

Read more RELATED
Recommended to you

Latest news