ఎన్టీఆర్‌ అంత చేతకాని వాడు ఎవరూ ఉండరు : మంత్రి దాడిశెట్టి

-

దేశం మొత్తమ్మీద ఎన్టీఆర్‌ అంత చేతకానివాడు ఎవరూ ఉండరు ఉంటూ మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్‌పై రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రం ఆయన గుప్పిట్లో ఉండగా.. మంత్రివర్గ సభ్యుడైన నాదెండ్ల భాస్కరరావుతో ఒకసారి, సొంత అల్లుడు చంద్రబాబుతో మరోసారి వెన్నుపోటు పొడిపించుకున్నారని ఎద్దేవా చేశారు.

అందుకే ఎన్టీఆర్‌ను చేతకానివాడిగా వర్ణించాను అని సమర్థించుకున్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పుకొచ్చారు. కాకినాడ జిల్లా తొండంగిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

‘ఎన్టీఆర్‌కు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి పోలికే లేదు. వైఎస్‌ ప్రజల మనిషి. అమరావతి రైతుల రూపంలో అమరావతి స్థిరాస్తి వ్యాపార మేళం ప్రతి నియోజకవర్గంలో తిరుగుతోంది. వీరంతా వ్యంగ్యంగా నాట్యం చేస్తూ, తొడలు కొడుతున్నారు. వీరి చేష్టలను రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు’ అని మంత్రి రాజా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news