టీడీపీ అధికారంలోకి వచ్చాక జగన్ కు పాఠాలు నేర్పిస్తా – అచ్చెన్నాయుడు

-

టీడీపీ అధికారంలోకి వచ్చాక జగన్ కు పాఠాలు నేర్పిస్తామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లైనా జగన్ విధ్వంసాన్ని కొనసాగిస్తూనే ఉన్నారని నిప్పులు చెరిగారు. గీతం యూనివర్సిటీ గోడలు కూల్చడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు.

అచ్చెన్నాయుడు
అచ్చెన్నాయుడు

కోడి కత్తి డ్రామాని న్యాయస్థానాలు బట్ట బయలు చేయడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్ విధ్వంసానికి పూనుకున్నాడని ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. చదువుల తల్లి గీతం యూనివర్సిటీ పై జగన్ రెడ్డికి అంత కక్ష ఎందుకు ? అని నిలదీశారు.

టీడీపీ నేతల ఆస్తులు కూల్చడం, అక్రమ కేసులు పెట్టడం జగన్ రెడ్డికి వ్యసనంగా మారిపోయిందన్నారు. నియంతలు,నికృష్టులు పాలకులైతే పరిపాలన ఇలానే ఉంటుందని తెలిపారు. ప్రతిపక్షనేతల ఆస్తులు కూల్చుతున్న జగన్ రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చడం ఖాయమని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక జగన్ కి, వైసీపీ నేతలకు పరివర్తన పాఠాలు నేర్పిస్తామని వివరించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news