అలెర్ట్ : ఏపీకి మ‌రో మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు

-

ఏపీకి మ‌రో మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. తూర్పు గాలులలో ఏర్పడిన ద్రోణి, నైరుతి బంగాళా ఖాతము దగ్గర నున్న ఉత్తర శ్రీలంక తీర ప్రాంతం నుండి ఉత్తర బంగాళా ఖాతము లోని మధ్య ప్రాంతాల వరకు వ్యాపించి ఉన్నది. ఇది సగటు సముద్ర మట్టానికి 0 .9 కిలోమీటర్లు ఎత్తు వరకు విస్తరించింది ఉన్నది.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వ‌ర్షాలు ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ఈ మూడు ప్రాంతాల్లోనే వ‌ర్షాలు ఉన్న‌ట్లు వెల్లడించింది. రేపు తేలిక పాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని.. ఎల్లుండి తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది వాతావరణ కేంద్రము.

Read more RELATED
Recommended to you

Latest news