BREAKING: తమిళనాడులో కూలిన ఆర్మీ హెలికాప్టర్… ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్

-

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీకి సంభందించిన హెలికాప్టర్ కుప్పకూలింది. అయితే దుర్ఘటన సీడీఎస్ బిపిన్ రావత్ ఉన్నట్లు సమాచారం. అయితే హెలికాప్టర్ లో ఘటన జరిగే సమయంలో మొత్తం 09 మంది ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో నలుగురు ఆర్మీ ఉన్నతాధికారులతో పాటు వారి కుటుంబ సభ్యలు ఉన్నట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మరణించినట్లు తెలుస్తోంది. కోయంబత్తూర్, కూనూర్ మధ్య ఆర్మీకి చెందిన ఎంఐ-17వీ5 హెలికాప్టర్ కూలింది. మొదటగా ఘటనను స్థానికులు గుర్తించారు. ఘటనలో గాయపడిన వారిని కూనూర్ లోని ఆసుపత్రికి తరలించారు.

అయితే మొత్తం 09మందిలో 6 మంది హై ర్యాంకు ఉన్న ఆర్మీ అధికారులు ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ఘటనలో ఏదైనా విద్రోహ కోణం ఉందా.. అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఆర్మీ ఉన్నతాధికారులు హుటాహుటీన చేరుకున్నారు. రెస్య్కూ దళాలు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇండియన్ ఏయిర్ ఫోర్స్ ఘటనపై అధికారిక విచారణకు ఆదేశించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news