తిత్లీ విధ్వంసం మరవకముందే…ఏపీకి ‘గజ’ తుఫాన్ ఎఫెక్ట్

-

తిత్లీ తుఫాన్ నుంచి పూర్తిగా కోలుకోకుండానే…ఏపీని మరో తుఫాన్ వెంటాడనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రాష్ట్రం వైపుగా దూసుకొస్తోంది. ఇది నెల్లూరు జిల్లా శ్రీహరి కోటను 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుఫాన్‌కు ‘గజ’గా పేరు పెట్టగా.. దీని ప్రభావం ఏపీతో పాటూ తమిళనాడుపై ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.

తుఫాన్ ప్రభావంతో సంబంధిత ప్రాంతాల్లో ఈ నెల 14 నుంచి 17 వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు

Read more RELATED
Recommended to you

Latest news