షర్మిల గురించి ఏపీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

-

కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి ఎవరు వచ్చినా సాదరంగా ఆహ్వానిస్తామని ఏపీ పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్ద రాజు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వైఎస్సాఆర్‌ కుమార్తె వైఎస్‌ షర్మిల పార్టీలోకి వస్తే ఆమెను తప్పకుండా ఆహ్వానిస్తామని ఆయన అన్నారు. ఈరోజు కాకినాడలో ఆయన వంద సంవత్సరాల క్రితం బుచ్చి సాంబ మూర్తి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ సెషన్స్‌ జరిగాయి. దాన్ని పురస్కరించుకొని శుక్రవారం కాకినాడలో సెంటినరీ సెలబ్రేషన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా గిడుగు రుద్దరాజు పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పార్టీలోకి ఎవరు వచ్చిన ఆహ్వానిస్తామని తెలిపారు. డీకే శివకుమార్‌, చంద్రబాబు ఎయిర్ ఫోర్ట్ లో మామూలుగా మాట్లాడుకున్నారే తప్ప.. రాజకీయాల గురించి కాదని వివరించారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు పార్టీ అభ్యర్థుల్ని సమయత్తం చేస్తుందని వివరించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్లు రుద్దరాజు తెలిపారు. పార్లమెంట్  ఎన్నికల కోసం ఏపీలో అభ్యర్థుల్ని ప్రకటించడానికి అధిష్టానం కూడా ముందుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news