KTR : పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటాలి.. కేటీఆర్‌ పిలుపు

-

లోక్ సభ ఎన్నికల్లో నూతనోత్సాహంతో పనిచేసి బీఆర్‌ఎస్‌ ను విజయతీరాలకు చేర్చాలని మున్సిపల్‌ కౌన్సిలర్లు, పార్టీ నాయకులకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. అధికారంలో లేకపోయినా వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేలా చూడాలని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన పథకాలు అమలు చేసేవరకు సూచించారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కేటీఆర్ ఆకాంక్షించారు.

 

శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించిన కేటీఆర్…. నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ పిల్లాపాపలతో కలకాలం సంతోషంగా ఉండాలని శుభాకాంక్షలు తెలిపారు. ఓవైపు శుభాకార్యాలు, మరోవైపు ఆప్తులను కోల్పోయిన కుటుంబాలను పరామర్శించాడు. మీకు ‘నేనున్నా’ అంటూ కేటీఆర్‌ ధైర్యం చెప్పారు. వార్డులోని ప్రజలను కలిసి ‘బాగున్నారా’ అంటూ యోగా క్షేమాలు తెలుసుకుంటూ ఆప్యాయంగా పలుకరించారు. అనంతరం వచ్చే లోక్సభ ఎన్నికల సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news