తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకం

-

తెలంగాణ హై కోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఎంఎస్‌ రామచంద్ర రావు అనే సీనియర్‌ న్యాయవాది ని తెలంగాణ హై కోర్టు తాత్కాలిక సీజే గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్‌. రాజ్యంగం రూపొందించిన ఆర్టికల్‌ 223 ప్రకారం… ఎంఎస్‌ రామచంద్ర రావు ను తాత్కాలిక జడ్జి గా నియమిస్తున్నట్లు పేర్కొంది.

ప్రస్తుతం ఉన్న జడ్జిని… హిమా కోహ్లీ… సుప్రీంకోర్టు న్యాయమూర్తి గా బదిలీ అయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా తెలిపింది. కాగా…. తెలంగాణ హైకోర్టు లో ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ కి వీడ్కోలు ఇచ్చారు న్యాయవాదులు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి గా బదిలీ అయిన జస్టిస్ హిమా కోహ్లీ కి న్యాయమూర్తులు, న్యాయవాదులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రాంగణంలో జస్టిస్ హిమా కోహ్లీ కి వీడ్కోలు ఏర్పాటు చేసింది బార్ అసోసియేషన్.

Read more RELATED
Recommended to you

Latest news