కాంగ్రెస్ కు ఓటేస్తే ఇండియా 3 ముక్కలవుతుంది – ఎంపీ అరవింద్‌

-

కాంగ్రెస్ కు ఓటేస్తే ఇండియా 3 ముక్కలవుతుందని హెచ్చరించారు బీజేపీ ఎంపీ అరవింద్‌. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ లో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్..అనంతరం మాట్లాడుతూ….మీరు అంతర్జాతీయ సంస్థతో లెక్కలేయండి ఫ్యాక్టరీ నెల రోజుల్లో తెప్పిస్తానన్నారు. మోడీ తాను బ్రతికున్నంత వరకు బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తగ్గించి ముస్లింలకు ఇచ్చే సమస్య లేదని తెలిపారని వివరించారు.

మతతత్వ రిజర్వేషన్లు ఉండవు.. ఎకనామికల్ బ్యాక్ వార్డ్ అన్ని కులమతాలకు చెందిన వారికి రిజర్వేషన్లు ఉంటాయని చెప్పారు. మోడీ పాలనలో ఏక్ మియకు ఏక్ బిబి.. కుటుంబ నియంత్రణ ఉంటుందన్నారు. రేవంత్ రెడ్డి నిన్న ఒక గుడ్డు మోసిండు… ఇంకా ఆరు గుడ్ల గురించి చెప్పలేదని నిలదీశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని మర్చిపోయి గుడ్లు మోస్తుంటే పెద్దమనిషి చెప్పాల్సింది పోయి జీవన్ రెడ్డి ఆయన కూడా గుడ్లు మోస్తున్నారని ఆగ్రహించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే ముస్లిం రాజ్యం అయిపోయి.. దేశం మూడు ముక్కలవుతుందని వార్నింగ్‌ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news