ప్రతిపక్ష నేతలపై దాడులు జరుగుతున్నాయో.. లేక వాళ్లే కావాలని చేసుకుంటున్నారో ? : వంగలపూడి అనిత

-

సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతోన్న దాడులపై తాజాగా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. సోమవారం హోం శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై దాడులు జరుగుతున్నాయో.. లేక వాళ్లే కావాలని చేసుకుంటున్నారో విచారణ జరిపిస్తామని తెలిపారు. తప్పు చేస్తే తెలుగుదేశం పార్టీ నేతలు అయిన సరే చర్యలు తీసుకుంటామని హోంమంత్రి స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం మాదిరిగా ప్రతికార చర్యలు ఉండబోవని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాక.. తెలుగుదేశం పార్టీ నేతలు అంతా ఇళ్లకే పరిమితమయ్యారని అన్నారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావు పేట నియోజకవర్గం నుండి విజయం సాధించిన వంగలపూడి అనిత.. చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. వంగలపూడి అనితకు చంద్రబాబు కీలకమైన రాష్ట్ర హోంశాఖ బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news