తరుణ్ – ఆర్తీ ల పెళ్లి ఆగిపోవడానికి కారణం వారే..?

-

సినీ వారసుడిగా సినీ ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమైన తరుణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నువ్వే కావాలి సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఈ సినిమాతో యువతను అందరిని తనవైపు తిప్పుకున్నాడు. ఇక ఎన్నో రికార్డు స్థాయిలో చిత్రాలను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకొని లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ అందంతో హుషారుగా నటించడం చూసి అమ్మాయిలు సైతం ఫిదా అయ్యేవారు. ఈ సినిమా క్రియేట్ చేసిన సంచలనాలతో ఇప్పటికీ ఈ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే నువ్వే కావాలి సినిమా ప్రేక్షకులను ఎంతగా మెప్పించిందో ప్రియమైన నీకు సినిమా కూడా అంతే విజయాన్ని అందించింది. ఇక ఈ సినిమాతో టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ గా మారిపోయారు.

ఇక రోజా రమణి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన నువ్వే నువ్వే సినిమా ద్వారా మంచి విజయం పొందారు. ఇక దాంతో టాప్ హీరోల లిస్టులోకి చేరిపోయారు. ఇకపోతే నువ్వు లేక నేను లేను సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన మంచి విజయాన్ని పొందాడు. ఇక ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆర్తి అగర్వాల్ తో ప్రేమలో ఉన్నాడని వార్తలు కూడా జోరుగా సాగాయి. ఇక తర్వాత బెస్ట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్న వీరి జంట సోగ్గాడు సినిమాలో మళ్ళీ కలిసి రొమాన్స్ చేశారు. కానీ అనుకున్న మేరా విజయం సాధించలేదు..

ప్రేమ అయితే బలపడింది ఇక కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వారి పెళ్లికి తరుణ్ తల్లి రోజా రమణి అడ్డుపడ్డారట. ఈ క్రమంలోనే ఆవేదనకు గురైన ఆర్తి అగర్వాల్ ఆత్మహత్యకి కూడా ప్రయత్నించిందని, కానీ కొంతకాలం తర్వాత అందులో నుంచి బయటకు వచ్చి అమెరికాకు చెందిన ఎన్నారై ను వివాహం చేసుకుంది. ఇక వైవాహిక జీవితంలో కూడా సంతోషంగా లేక మళ్లీ సినిమాలలో బాగా లావు అయ్యి కనిపించింది. కానీ మళ్లీ అవకాశాలు రాలేదు. ఇక శస్త్ర చికిత్స చేయించుకోవాలని వెళ్లి శస్త్ర చికిత్స వికటించడంతో స్వర్గస్తురాలు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news