చిరంజీవి, రాజమౌళిని అవమానించిన అహంకారి జగన్: చంద్రబాబు

-

సినిమా ఇండస్ట్రీని అవమానించిన సంస్కారం లేని వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని చంద్రబాబు మండిపడ్డారు.కోనసీమ అంబేడ్కర్ జిల్లా పి. గన్నవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… ‘చిత్రసీమలో రారాజుగా వెలిగిన చిరంజీవికి, జగన్ కి పోలిక ఉందా? దర్శక దిగ్గజం రాజమౌళి, హీరోలను ఇంటికి పిలిపించి అవమానించారు అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పవన్ సినిమాలకు రేట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఆయనకు ఊడిగం చేస్తే సినిమాలను ఆడనిస్తాడు. శునకాన్ని తీసుకెళ్లి సింహాసనంపై కూర్చోపెడితే ఇలాగే ఉంటుంది’ అంటూ ధ్వజమెత్తారు.

జగన్ పాలనలో రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని.. కాపాడుకోకపోతే రాష్ట్రాన్ని శాశ్వతంగా దక్కించుకోలేమని చంద్రబాబు తెలిపారు. ‘ఆరోగ్య శ్రీ కింద వైద్యం పడకేసింది. బటన్ నొక్కింది ఎంత? వైసీపీ వాళ్లు దోచింది ఎంత? అని మండిపడ్డారు .భూపరిరక్షణ చట్టం పేరుతో ప్రజల భూమిని తాకట్టు పెట్టి ఇతరులకు బదిలీ చేసే ప్రమాదం ఉంది. జగన్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపారు. మద్యం తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్లు తెచ్చారు’ అని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news