రైల్వే స్టేషన్ లో సామాన్యుడిలా మాజీ కేంద్ర మంత్రి..!

-

మాజీ కేంద్రమంత్రి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు సామాన్యుడులా రైల్వే ప్లాట్ ఫార్మ్ మీద కూర్చున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. సికింద్రాబాద్ నుండి విజయనగరం ట్రైన్ లో ట్రావెల్ చేయడానికి ఆయన కుటుంబంతో పాటుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫార్మ్ మీద కూర్చున్నారు. అశోక్ గజపతిరాజు గతంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పని చేశారు రాజ కుటుంబానికి చెందిన వారు వీళ్లు.

సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన కూడా సామాన్య ప్రయాణికుల రైల్వే స్టేషన్ లో కనపడటం అందరికీ ఆశ్చర్యంగా ఉంది ఆయన కావాలంటే విఐపి గదిలో కూర్చునేలా చేసుకోవచ్చు. అధికారులు వచ్చి స్వయంగా ఆయన్ని విఐపి గదిలో కూర్చో పెడతారు ప్రత్యేక విమానంలో కూడా ఆయన అనుకుంటే ప్రయాణం చేయొచ్చు. కానీ అవి ఏమీ ఆయన కోరుకోలేదు సామాన్యుడిలా అశోక్ గజపతిరాజు కుటుంబం రైలు ప్రయాణం చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అశోక్ గజపతిరాజు రాష్ట్ర మంత్రిగా పనిచేసినప్పుడు ప్రభుత్వానికి కేటాయించిన వాహనాన్ని కాకుండా సొంత కారులోనే సచివాలయానికి వెళుతూ ఉండేవారు

Read more RELATED
Recommended to you

Latest news