మన దేశంలో టాప్‌ 10 సంపన్న ఆలయాలు ఇవే

-

దేశంలో ఎన్నో ఆలయాలు, ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. మనకు కూడా కొన్ని ఇష్టమైన ఆలయాలు ఉంటాయి కదా..! దేశంలో టాప్‌ టెన్ సంపన్నమైన ఆలయాలు ఏంటో మీకు తెలుసా..? అందులో ఇప్పటి వరకూ మీరు ఎన్ని ఆలయాలకు వెళ్లి ఉంటారో చూడండి..!

పట్నాభస్వామి దేవాలయం

దేశంలోని అత్యంత ధనిక దేవాలయాల జాబితాలో కేరళలోని పట్నాభస్వామి ఆలయం ముందు వరుసలో ఉంది. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయం. త్నాభస్వామి ఆలయంలోని ఖజానాలలో వెలకట్టలేని రత్నాలు, బంగారం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం దాదాపు 120000 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్లు సమాచారం

తిరుపతి బాలాజీ దేవాలయం

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి బాలాజీ దేవాలయం సంపదలో రెండో స్థానంలో ఉంది. అంతేకాదు, ఇది ప్రపంచంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటి. దేశం మొత్తం ఆస్తులు రూ.85,705 కోట్లు. ఆలయ ట్రస్టు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 7,123 ఎకరాల్లో విస్తరించి ఉన్న 960 ఆస్తుల విలువను టీటీడీ విడుదల చేసింది. ప్రతిరోజు దాదాపు 30000 మంది భక్తులు ఇక్కడికి వస్తారని అంచనా.

షిర్డీ సాయిబాబా దేవాలయం

షిర్డీ సాయిబాబా దేవాలయం ధనిక దేవాలయాలలో తరచుగా మూడవ స్థానంలో ఉన్నట్లు నివేదించబడింది. ఆలయానికి 1800 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. అలాగే ఆలయానికి చెందిన 380 కిలోల బంగారం ఉంది.

వైష్ణో దేవి ఆలయం

నాల్గవ స్థానంలో వైష్ణో దేవి ఆలయం ఉంది. ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తున్న దేవాలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయానికి విరాళంగా దాదాపు 500 కోట్ల రూపాయలు అందుతాయి.

సిద్ధివినాయక దేవాలయం

గణేశుడు కొలువై ఉన్న సిద్ధివినాయక దేవాలయం గొప్ప ఆలయాల జాబితాలో చేర్చబడింది. ఈ ఆలయం విలువ రూ.125 కోట్లు అని సమాచారం.

జగన్నాథ దేవాలయం

జగన్నాథ దేవాలయం 6వ స్థానంలో ఉంది. ఈ ఆలయం రథోత్సవాలకు ప్రసిద్ధి చెందింది. ఆలయానికి సుమారు 150 కోట్ల ఆస్తులు ఉన్నాయి.

గురువాయూర్ దేవాలయం

దేశంలోనే ఏడవ సంపన్న దేవాలయం కూడా కేరళలోనే ఉంది. ఆలయానికి 2500 కోట్ల ఆస్తులున్నట్లు సమాచారం.

మీనాక్షి అమ్మన్ ఆలయం

మీనాక్షి అమ్మన్ ఆలయం దేశంలోని 8వ అత్యంత సంపన్న దేవాలయం. ఇది తమిళనాడులో ఉంది. 4,99,14,81,000 వార్షిక ఆదాయం నివేదించబడింది.

కాశీ విశ్వనాథ దేవాలయం

అత్యంత ప్రసిద్ధమైనది కాశీ విశ్వనాథ దేవాలయం. భారతదేశంలో 9వ అత్యంత సంపన్న దేవాలయం. ఈ ఆలయానికి ఆరు కోట్లకు పైగా ఆస్తులున్నాయి.

గోల్డెన్ టెంపుల్

నివేదిక ప్రకారం, పంజాబ్‌లోని గోల్డెన్ టెంపుల్ ప్రపంచంలోని 10వ అత్యంత సంపన్న దేవాలయం. ఈ ఆలయాన్ని 400 కిలోల బంగారంతో నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Latest news