వైసీపీపై అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు.. ఏం పీకుతున్నారు !

-

వైసీపీపై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలు లేని దేశం ఉంటుందా.. దొంగలు లేని మతం చూసి ఉండరు.. తెలుగువారి ప్రత్యేకత ఏమిటంటే.. బెయిల్ పై వచ్చిన వారిని, ముఖ్యమంత్రి ని చెయ్యడమని జగన్ కు చురకలు అంటించారు. వైసీపీ నేతలు ఏం పీకుతున్నారని ఓట్లు వేయాలని మండిపడ్డారు. తెలుగు భాష పైన పడడం.. ఏమైనా మాట్లాడితే ఏ కేసు పడుతుందో అనే పరిస్థితి ఉందని… చివరకు కుదరకపోతే కరోనా కేసు పెడతారని మండిపడ్డారు. సింహాచలం నుండి ఎనిమిది వందల ఎకరాలు మాయమైపోయాయట, అది అశోక్ గజపతి బాధ్యత అంటున్నారని ఫైర్ అయ్యారు.

ఎకరాలు చెబుతున్నారు.. రిజిస్టర్ లో సర్వే నెంబర్లు ఉండవా.. అవి ఎందుకు చెప్పడంలేదు ? అని ప్రశ్నించారు. మహానుభావుడు జగన్ వచ్చి, 500 ఎకరాలు భోగాపురం ఎయిర్పోర్ట్ లో సేవ్ చేశామని ప్రకటనలు చేశారు.. కానీ రైతుల భూములు తో వ్యాపారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఉత్తరాంధ్రలో, మౌలిక వసతులు తగ్గించి అభివృద్ధి చేస్తామంటూ నమ్మ గలమా.. విటిని లెక్కకడితే పుస్తకాలు రాయాలన్నారు. “భగవంతున్ని ఎప్పుడు ఏం కోరలేదు… పైడి తల్లి అమ్మని మాత్ర౦ ఇప్పుడు కొరతున్న.. ప్రభుత్వానికి మంచి బుద్ధి వచ్చేలా చూడు తల్లి ” అంటూ ఆయన ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news