వినాయక్ తో బాలయ్య.. టైటిల్ కూడా ఫిక్స్..!

-

100 సినిమాలు పూర్తి చేసుకున్న తర్వాత నందమూరి బాలకృష్ణ తన సినిమాల స్పీడ్ పెంచాడని తెలిసిందే. గౌతమిపుత్ర శాతకర్ణి, పైసా వసూల్, జై సింహా ప్రస్తుతం ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా చేస్తున్నాడు బాలయ్య బాబు. క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తాడని అంటున్నారు.

అయితే కొన్నాళ్లుగా బాలయ్యతో సినిమా కోసం వినాయక్ ఎదురుచూస్తున్నాడు. సి. కళ్యాణ్ నిర్మాణంలో ఈ మూవీ ఉంటుందని చెప్పుకొచ్చారు. కాని సినిమా మాత్రం తెరరూపం దాల్చలేదు. ఫైనల్ గా వినాయక్ తన స్టోరీతో బాలకృష్ణను ఒప్పించాడట. ఈ సినిమాకు టైటిల్ కూడా క్రాంతి అని ఫిక్స్ చేశారట. 2019 మొదట్లోనే వినాయక్, బాలయ్య కాంబో సినిమా మొదలవుతుందని తెలుస్తుంది.

చెన్న కేశవరెడ్డి సినిమా తర్వాత దాదాపు దశాబ్ధం తర్వాత వినాయక్ బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా వస్తుంది. ఖైది నంబర్ 150 సినిమా హిట్ కొట్టినా వినాయక్ కెరియర్ లో చాలా వెనుకపడి ఉన్నాడు. మరి బాలయ్య సినిమాతో అయినా అతను హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news