ఖరీదైన ఇంటిని సొంతం చేసుకున్న ‘ఆట’ సందీప్ దంపతులు..?

-

సామాన్య ప్రజలే కాదు సెలబ్రిటీలు కూడా ఎక్కడికి వెళ్లినా తమకంటూ కొన్ని తప్పకుండా సొంతంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి వాటిలో ఇల్లు, కార్, బైక్ లాంటివి కచ్చితంగా ఉండాలని ఆశిస్తూ ఉంటారు. ముఖ్యంగా వీటిని సొంతం చేసుకోవడానికి సామాన్యూల నుంచి సెలబ్రిటీల వరకు తెగ కష్టపడుతూ ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. అయితే అలా కష్టపడుతూ వచ్చి చివరికి తాము అనుకున్న కలలను నెరవేర్చుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలా మంది సీరియల్స్, బిగ్ బాస్ సెలబ్రిటీలు కూడా కొత్త ఇల్లు కొనుగోలు చేస్తూ కొత్త కార్స్ కి కూడా ఓనర్స్ అవుతున్నారు.

ఇప్పుడు ఈ క్రమంలోనే ఆట సందీప్ దంపతులు కూడా తాజాగా కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు.. అందుకు సంబంధించిన ఒక వీడియోని కూడా పోస్ట్ చేశారు. ఆట తొలి సీజన్ విన్నర్ గా నిలిచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్.. ఆ తర్వాత కాలంలో ఆట సందీప్ గా ఫేమ్ తెచ్చుకున్నాడు. తన తోటి డాన్సర్ అయిన జ్యోతిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం చిన్న చిన్న సినిమాలు ఈవెంట్స్ కి కొరియోగ్రఫీ చేస్తూ కాస్త బిజీగా వున్న ఈ దంపతులు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా ఇన్ స్టా, యూట్యూబ్ లో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. అలా నెటిజన్స్ కి కూడా ఈ జంట బాగా పరిచయమే.

అయితే ఇప్పుడు తాజాగా వీళ్ళు కొత్తగా ఇల్లు కొన్నట్లు చెప్పుకొచ్చారు. ఐదేళ్లు కష్టపడి ఫ్లాట్ సొంతం చేసుకున్నామని.. అందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాదు అందుకు సంబంధించిన వీడియోని కూడా పోస్ట్ చేయగా పలువురు ఆట సందీప్ దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news