Atmakuru by-elections: భారీ మెజారిటీ దిశగా వైసిపి

-

ఆంధ్రప్రదేశ్ లోని ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. మొదటి రౌండ్ నుంచి అధికార వైసీపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళుతోంది. ఇప్పటి వరకు నాలుగు రౌండ్లు పూర్తయ్యాయి. నాలుగో రౌండ్ లో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డికి 17,385 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇప్పటి వరకు ఆయనకు 21,043 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్థి భరత్ కుమార్ 3,658 ఓట్లు రాగా, బీఎస్పీ అభ్యర్థి 683, నోటా కు 699 ఓట్లు పోలయ్యాయి.

దీంతో రౌండ్ రౌండ్ కు ఆధిక్యం పెరగడంతో వైసిపి భారీ ఆధిక్యంతో గెలిచే అవకాశం కనిపిస్తుంది. మధ్యాహ్నం లోపు తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తం 14 కౌంటింగ్ టేబుల్స్, 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కాగా వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి ఆదిత్యం భారీగా ఉండడంతో బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ కౌంటింగ్ హల్ నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news