హైదరాబాద్ నాచారంలో దారుణం..కన్న బిడ్డను అమ్మకున్నతల్లిదండ్రులు!

-

హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది..కన్నబిడ్డను పోషించలేక అమ్ముకున్నారు తల్లిదండ్రులు..నాచారంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..ఈఎస్ఐ ఆస్పత్రి సాక్షిగా బిడ్డ అమ్మకం గుట్టుగా సాగిపోయింది.. ఐదు నెలల తర్వాత తమ బిడ్డను తమకు ఇప్పించాలంటూ పోలీసులను ఆశ్రయించింది తల్లి మీనా..మీనా వెంకటేష్ దంపతులకు జులై 19న బిడ్డ పుట్టగా.. పోషించడం కష్టంగా ఉందని వేరొకరికి అమ్మేసారు..కప్రా సర్కిల్లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న రాజేష్.. మీనాను తన భార్య అని చెప్పి ఈఎస్ఐ ఆస్పత్రిలో డెలివరీ చేయించి..అప్పుడే పుట్టిన బిడ్డను తీసుకువెళ్లాడు. అయితే తనకు పుట్టింది ఆడపిల్ల అని చెప్పి మోసం చేశారంటూ బాధితురాలు ఐదు నెలల తర్వాత పోలీసులను ఆశ్రయించింది.. తనకు మగబిడ్డ పుడితే ఆ విషయం దాచిపెట్టి మధ్యవర్తి అమ్మేశాడని చెప్పింది. ఇప్పుడు తన కొడుకు కావాలని పోలీసులను ఆశ్రయించింది తల్లి మీనా.

Read more RELATED
Recommended to you

Latest news