న‌ల్గొండ‌లో దారుణం.. మొండం లేని త‌ల

-

న‌ల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని చింత ప‌ల్లి మండ‌లంలో గ‌ల విరాట్ న‌గ‌ర్ లో మొండం లేని త‌లను గుర్తించారు. విరాట్ న‌గ‌ర్ లోని మైస‌మ్మ ఆల‌యం వ‌ద్ద ఈ మొండం లేని త‌లను స్థానికులు గుర్తించారు. పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వ‌డంతో పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని మొండం లేని త‌ల ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కేసు న‌మోదు చేసుకుని దర్యాప్తు జ‌రుపుతున్నారు. కాగ ఈ త‌ల ఎవరిది అని స్థానిక‌లు నుంచి పోలీసులు స‌మాచారం తెలుసుకుంటున్నారు.

కాగ ఈ మొండం లేని త‌ల మైస‌మ్మ ఆలయం వ‌ద్ద ఉండ‌టంతో ప‌లు అనుమానాలు క‌లుగుతున్నాయ‌ని పోలీసుల‌కు స్థానికులు వివ‌రించారు. అయితే దుండ‌గులు త‌లను ఇక్క‌డే ఎందుకు విడిచిపెట్టారు అని పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఇది హ‌త్యా లేదా న‌ర‌బ‌లి జ‌రిగిందా అనే కోణంలో పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. కాగ ఈ హ‌త్య లేదా న‌ర‌బలి ఆదివారం రాత్రే జ‌రిగిన‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news