Breaking: కర్నూలులో దారుణం..వైఎస్‌ విగ్రహం తల, చెయ్యి ధ్వంసం

-

Breaking: కర్నూలులో దారుణం చోటు చేసుకుంది. కర్నూలులో వైఎస్‌ విగ్రహం తల, చెయ్యి ధ్వంసం అయ్యాయి. కర్నూల్‌ జిల్లా కృష్ణగిరి లో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం తల, చెయ్యి తీసేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ దుశ్చర్య టిడిపి నాయకుల పనే అని వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు.

Atrocity in Kurnool Head and arm of YS statue destroyed

ఇది ఇలా ఉండగా, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి ఏపీ వ్యాప్తంగా టీడీపీ జన సేన నేతల అధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలపై ఎటాక్ చేస్తున్నారు… వైఎస్ ఫోటో ఉన్న శిలాఫలకాలు ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహించారు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. గతంలో గవర్నర్ కు ఫిర్యాదు చేశాం….పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని మండిపడ్డారు. వైసీపీకి ఓట్లు వేసిన వారిపై కూడా దాడులు చేస్తున్నారు… వైసీపీ అఫీసుల్లోకి అక్రమంగా చొరబడి బిల్డింగ్స్ కూల్చివేత చేస్తానని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని నిప్పులు చెరిగారు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. వైఎస్ విగ్రహాలు తగలబెట్టే పరిస్థితి ఉంది… వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news