బిహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ కావాలి : నీతీశ్ కుమార్

-

బిహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రాన్ని జనతాదళ్‌ (యునైటెడ్‌) డిమాండ్‌ చేసింది. పేరు ఏదైనా తమ రాష్ట్రానికి సాయం కావాలని విజ్ఞప్తి చేసింది. శనివారం జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసింది. బిహార్‌కు ప్రత్యేక హోదా కోసం సీఎం నీతీశ్‌ కుమార్‌ చాన్నాళ్ల నుంచి డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా చేరిన తర్వాత ఇప్పుడు ఆ స్వరంలో మార్పు రావడం గమనార్హం.

మరోవైపు ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర అంశాలపైనా ఈ సమావేశంలో  జేడీయూ తీర్మానాలు చేసింది. పేపర్ లీకేజీ కేసుల్లో నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తూ. పరీక్షల్లో అక్రమాలను నివారించేందుకు పార్లమెంట్‌లో కఠినచట్టం చేయాలని కోరింది. బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రాజ్యసభ ఎంపీ సంజయ్‌ కుమార్‌ ఝా ఎంపికయ్యారు. గతంలో ఝా.. బీజేపీలో పనిచేశారు. ఇండియా కూటమితో సంబంధాలు తెంచుకొని బీజేపీతో జేడీయూ జతకట్టడం వెనక కూడా ఝా కీలకపాత్ర పోషించారు.

Read more RELATED
Recommended to you

Latest news