“సుఖీభవ” శరత్ పై 10 మంది రాడ్లు, కర్రలతో దాడి…కారణం ఇదే..!

-

అయ్యయ్యో వద్దమ్మ… సుఖీభవ సుఖీభవ .. అంటూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యిన నల్లగుట్ట శరత్ పై దాడి జరిగింది. 10 మంది యువకులు డ్యాన్సర్ శరత్ పై కర్రలు , రాడ్ లతో దాడి చేసినట్టు తెలుస్తోంది. దాంతో కన్ను వాపు రావడం తో పాటు నోరు, ముక్కు భాగం లో తీవ్ర గాయాలయ్యాయి. గతంలో తన చెల్లిని వేధిస్తున్నారని సాయి , హరి వర్గం పై శరత్ దాడి చేసినట్టు తెలుస్తోంది. దాంతో శరత్ ను అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు పంపారు.

శరత్ కొద్ది రోజుల క్రితమే జైలు నుండి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల సుఖీభవ …. సుఖీభవ .. వీడియో వైరల్ కావడం తో శరత్ సోషియల్ మీడియా స్టార్ గా మారిపోయారు. అయితే హిజ్రాలను కించ పరిచేలా వీడియో చేశానని అందువల్ల హిజ్రాలు దాడి చేశారని వార్తలు వస్తున్నాయని అది అవాస్తవం అంటూ శరత్ ఖండించారు. ఫేమస్ అయ్యానని, సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని తెలిసి కక్ష కట్టి తనపై ఓ వర్గం దాడి చేసిందని శరత్ ఆరోపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news