Navajeevan Express : నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌లో టీసీపై యువకుల దాడి

-

నవజీవన్ ఎక్స్​ప్రెస్ రైలులో టికెట్ కలెక్టర్​పై ఇద్దరు యువకులు దాడికి తెగబడ్డారు. అహ్మదాబాద్‌ నుంచి చెన్నై వెళ్లే నవజీవన్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఈ ఘటన జరిగినట్లు ఖమ్మం జీఆర్పీ ఎస్సై భాస్కర్‌రావు తెలిపారు. బాధిత టీసీ ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

కిరణ్‌ కుమార్‌ బల్లార్షా నుంచి విజయవాడ వరకు టీసీగా విధులు నిర్వహిస్తున్నారు. వరంగల్‌ రైల్వే స్టేషన్‌లో మహబూబాబాద్‌కు చెందిన గొల్లపల్లి రవితేజ, వరంగల్‌కు చెందిన మోతిపట్ల సుమన్‌ టికెట్‌ లేకుండా ఎస్‌-1 బోగిలో ప్రయాణిస్తున్నారు. వారిని టికెట్‌ అడిగినందుకు ఇద్దరు కిరణ్​తో గొడవ పడ్డారు. గొడవ ముదిరి చివరకు ఇద్దరూ కలిసి టీసీపై దాడికి పాల్పడ్డారు.

వీరి దాడిలో కిరణ్‌ కుమార్‌ గాయపడ్డారు. తోటి ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో సీటీఐ శ్రీరాం టీసీ కిరణ్‌కుమార్‌ను మహబూబాబాద్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కిరణ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై భాస్కర్‌రావు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news