నేడు భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే అఫ్ లైన్ లో మ్యాచ్ టికెట్ల విక్రయం

-

నేడు భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే అఫ్ లైన్ లో మ్యాచ్ టికెట్ల విక్రయం జరుగనుంది. విశాఖ లో ఈ నెల 19వ తేదిన జరగనున్న డే ఆండ్ నైట్ వన్డే మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలోనే… నగరంలో మూడు టికెట్ల విక్రయం కేంద్రాలు ఏర్పాటు చేశారు.

పీఎంపాలెం క్రికెట్ స్టేడియం-బి, టౌన్ కొత్తరోడ్డులోని ఇందిరా ప్రియదర్శిని మునిసి పల్ స్టేడియం, గాజువాకలో గల రాజీవ్ గాంధీ క్రీడా ప్రాంగణం వద్ద టికెట్ల విక్రయాలు చేస్తున్నారు. ఇవాళ ఉదయం 10.00 గంటలకు టికెట్ల విక్రయం ప్రారంభం కానుంది. ఇక టికెట్ల ధరలు రూ.600, రూ.1,500, 2,000, రూ.3,000, రూ.3,500, రూ.6.000 గా ఉన్నాయి. కౌంటర్ల వద్ద తోపులాట, తొక్కిసలాటలకు తావివ్వకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు అధికా రులు.

Read more RELATED
Recommended to you

Latest news