నాచారంలో ఉద్రిక్తత.. టీఆర్ఎస్ అభ్యర్థి ఇంటి మీద దాడి !

-

గ్రేటర్ ఎన్నికల సందర్భంగా చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటోంది.  నాచారం 6వ డివిజన్ లో కూడా కొద్ది సేపటి క్రితం దాకా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెరాస అభ్యర్థి ఇంటి వద్ద కాంగ్రెస్, తెరాస వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. తెరాస అభ్యర్థి ఇంటి పై కాంగ్రెస్ వర్గీయులు దాడి చేశారని తెరాస నేతలు ఆందోళనకు దిగారు.

ఇరు వర్గాల వారిని చెదరగొట్టిన పోలీసులు అక్కడ ఎవరినీ ఉండకుండా పంపించి వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతి భర్త మేడల మల్లికార్జున్ తో ప్రాణహాని ఉంది అని తెరాస అభ్యర్థి శాంతి సాయి జెన్ శేఖర్ ఆరోపిస్తున్నారు. దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా ఆయన సిద్ధమయ్యారు. మరో పక్క రాం నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్ఎస్ .బీజేపీ నేతలు బాహాబాహీకి దిగారు. టిఆర్ఎస్ నాయకులు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని బీజేపీ శ్రేణుల ఆరోపిస్తున్నాయి. ఒకరినొకరు కాలర్లు పట్టుకొని గొడవలకు దిగారు ఇరు పార్టీ నేతలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version