వైసీపీ ఎమ్మెల్యే సోదరుడిపై దాడి..తీవ్ర గాయాలు…!

-

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి సోదరుడు ప్రహ్లాదరెడ్డి పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ప్రహ్లాదరెడ్డిపై కర్రలు, రాళ్లతో దుండగులు దాడి చేశారు. రెండు వాహనాల్లో వచ్చి దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు. ఈ దాడిలో గంగుల ప్రహ్లాదరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు.


అయితే సుధాకర్‌రెడ్డి, మణికంఠ అనే వ్యక్తులు తనపై దాడి చేశారని ప్రహ్లాద్ రెడ్డి చెబుతున్నారు. ప్రహ్లాద‌రెడ్డిపై దాడికి ఆర్థిక లావాదేవీలే కారణమని అనుమానం వ్యక్తం చేశారు. ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news