టీమిండియాతో ఇక అలాంటివి ఉండవు అంటున్న ఆసీస్ కోచ్..!

-

ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా భారత్ మ్యాచ్ అంటే చాలు ఒకరినొకరు కవ్వింపులకు దిగటం లాంటి ఘటనలు ఎన్నో మ్యాచ్ మధ్యలో కనిపిస్తూ ఉంటాయి. గతంలో ఇలా పలుమార్లు జరిగింది కూడా. అయితే ఈ సారి మాత్రం ఆస్ట్రేలియా భారత్ మధ్య జరగబోయే మ్యాచ్ లో ఎలాంటి కవ్వింపు లకు దిగబోము అంటూ ఇటీవలే ఆస్ట్రేలియా కోచ్ లాంగర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఎలాంటి మాటలు యుద్ధం జరగకుండానే రెండు జట్ల మధ్య పోటీ తీవ్ర స్థాయిలో పోటీ ఉంటుందని చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా కోచ్ లాంగర్ . అయితే గత కొన్నేళ్ల నుంచి కవ్వింపు లకు దూరంగా ఉండి ప్రస్తుతం కేవలం మైదానంలో సరదాని మాత్రమే కోరుకుంటున్నామూ అంటూ చెప్పుకొచ్చారు ఆయన. అంతేకాకుండా ఆస్ట్రేలియా క్రికెటర్లకు కోహ్లీ అంటే ఎంతగానో ఇష్టపడుతుంటారు అంటూ చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news