శ్రీలంకతో కీలక మ్యాచ్ లో పట్టు బిగిస్తోన్న ఆస్ట్రేలియా…!

-

లక్నో లో శ్రీలంక మరియు ఆస్ట్రేలియా మధ్యన జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన మెండిస్ బ్యాటింగ్ ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. కానీ ఓపెనర్లు గా వచ్చిన నిస్సంక మరియు పెరీరా లు మొదటి వికెట్ కు 125 పరుగులు జోడించి భారీ స్కోర్ కు బాటలు వేశారు. కానీ ఒక్కసారి నిస్సంక (61) రూపంలో మొదటి వికెట్ పడ్డాక, ఆ వెంటనే పెరీరా (78) , మెండిస్ (9), సమరవిక్రమ (8), ధనుంజయ (7) మరియు వెళ్లలాగే (2) వికెట్లు కేవలం 32 పరుగులు జత చేశాక పడిపోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఇప్పుడు కనీసం 230 పరుగులు అయినా చేస్తుందా అని సందేహంలో శ్రీలంక యాజమాన్యం ఉంది. ఆస్ట్రేలియా వరుస వికెట్లు పడగొట్టి మ్యాచ్ పై పట్టు సాధిస్తోంది. ఇదే విధంగా ఆస్ట్రేలియా బౌలింగ్ చేస్తే మరో 50 పరుగుల లోపే శ్రీలంక ఆల్ అవుట్ అయ్యి తక్కువ టార్గెట్ ను ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం క్రీజులో ఉన్న అసలంక మరియు కరుణరత్నే లు ఆడే దాన్ని బట్టి టార్గెట్ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news