తనలా మెరవాలంటే ఇలా చేయాలంటోన్న జాన్వీ పాప..!

-

ప్రముఖ సీనియర్ హీరోయిన్ దివంగత శ్రీదేవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఆమె కూతురు జాన్వి కపూర్ కూడా తన అందచందాలతో బాగా పాపులారిటీని సంపాదించుకుంటోంది. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలినాళ్లలోనే విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ క్రేజ్ తోనే ఒక్కో సినిమాకు ఏకంగా రూ.5 కోట్ల రూపాయల తీసుకునే స్థాయికి చేరుకుంది. ఇకపోతే ఇప్పటివరకు టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోయిన్ కూడా తీసుకోని పారితోషకం ఈమె హీరోయిన్ తీసుకుంటూ ఉండడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. దీన్ని బట్టి చూస్తే జాన్వి కపూర్ కు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

స్నేహితురాలు సారా అలీఖాన్ తో ఎప్పుడూ పబ్బులు, పార్టీలు అంటూ తిరుగుతూనే మరొకవైపు సోషల్ మీడియా ద్వారా తన హాట్ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇకపోతే జాన్వి కపూర్ ఇంత అందం పొందడానికి కారణం తన తల్లి పాటించిన టిప్స్ అంటూ చెప్పుకొచ్చింది జాన్వి కపూర్. ఇకపోతే ఇటీవల ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ తనలా మెరవాలి అంటే ప్రతి ఒక్క అమ్మాయి ఇలా చేయాల్సిందే అంటూ తన బ్యూటీ సీక్రెట్స్ ని బయట పెట్టింది ఈ ముద్దుగుమ్మ.

ఇక మెరిసిపోయే చర్మం కోసం ఏం చేయాలంటే జాన్వి కపూర్ మాట్లాడుతూ.. అందం కోసం తన తల్లి ఏ టిప్స్ అయితే ఫాలో అయిందో.. తాను కూడా అవే టిప్స్ ఫాలో అవుతున్నానని తెలిపింది. ఇక ఆమె మాట్లాడుతూ ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మిగిలిన పండ్ల ముక్కలను ముఖానికి మసాజ్ లా ప్యాక్ పెట్టుకుంటాను అంటూ ఈమె తెలిపింది. ఇకపోతే అప్పటికప్పుడు ఏ పండ్లు దొరికినా సరే వాటిని ముఖానికి అప్లై చేసుకుంటానని 10 నిమిషాల తర్వాత ముఖం కడుక్కుంటానని జాన్వి కపూర్ వెల్లడించింది. ముఖ్యంగా తన అందానికి కారణం తన తల్లి చెప్పిన ఈ బ్యూటీ టిప్స్ అంటూ జాన్వీ కపూర్ పేర్కొంది. ఇక తాజాగా ఈమె నటించిన గుడ్ లక్ జెర్రీ అనే సినిమా జూలై 29వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news