లైగ‌ర్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. షూటింగ్ బంద్

-

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ సినిమా అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్. క‌రోనా ప్ర‌భావం ఈ సినిమా పై కూడా ప‌డింది. ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా ప‌డింది. ఈ విష‌యాన్ని లైగర్ సినిమా నిర్మాత ఛార్మీ కౌర్ ట్విట్ట‌ర్ ద్వారా అధికారికంగా తెలిపింది. క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతున్న నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఛార్మీ తెలిపింది. క‌రోనా కేసుల పెరుగుతున్న స‌మ‌యంలో ఈ సినిమా సిబ్బందిని న‌టీన‌టుల‌ను ఇబ్బందుల‌కు గురి చేయ‌వ‌ద్ద‌నే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపారు.

అంద‌రూ ఇంట్లోనే సేఫ్ గా ఉండాల‌ని ట్విట్ట‌ర్ ద్వారా ఛార్మీ కోరింది. అయితే ఇటీవ‌ల చాలా మంది టాలీవుడ్ న‌టీన‌టులు కరోనా బారీన ప‌డుతున్నారు. నిన్న ఒక్క రోజే ప్రిన్స్ మ‌హేష్ బాబు, మంచు ల‌క్ష్మీ, సీనియ‌ర్ హీరోయిన్ మీనా అలాగే ఇప్పుడు ఉన్న థ‌ర్డ్ వేవ్ లో వీరితో పాటు మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ ఎస్ థ‌మ‌న్, మంచు మ‌నోజ్, క‌మ‌ల్ హాస‌న్ తో పాటు చాలా మంది న‌టీన‌టులు క‌రోనా బారిన ప‌డ్డారు. ఇలాంటి సంద‌ర్భంలో చాలా సినిమాలు త‌మ షూటింగ్ ను క్యాన్సిల్ చేసుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news